telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

MLC-Palla-Rajeshwar-Reddy

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టి, వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా నియమిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే జూన్ లోగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలన్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతు వేదికల నిర్మాణం చేపడతామన్నారు. ఇతర అంశాలపై నాలుగు రోజుల్లో కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చాలనుకుంటున్నట్టు కేసీఆర్ నిర్ణయించుకున్నారు. రైతులకు అన్నివిధాలా అండగా నిలిచేలా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలన్నది కేసీఆర్ ప్రణాళిక అని తెలంగాణ సీఎంఓ ట్విట్టర్లో పేర్కొంది.

Related posts