telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా పై కడియం ఫైర్ 

Kadiyam Srihari Fires On Congress

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. బీజేపీలో చేరుతున్నానంటూ తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన దక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవీ, మహాన్యూస్ సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిస్తూ కడియం శ్రీహరి బహిరంగ లేఖను విడుదల చేశారు.

ఎదుగుతున్న దళిత నాయకత్వాన్ని బలహీనపర్చే కుట్రలో భాగంగా కొన్ని స్వార్థ శక్తులు బురద చల్లే ప్రయత్నం చేస్తుంటాయని ఆరోపించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని, దీనిని గమనించాల్సిందిగా ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. కులం, మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు తాను దూరంగా ఉండే వ్యక్తినని, బీజేపీలోకి వెళ్లే దుస్థితి తనకు లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts