telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

శుభ్రమైన కూరగాయలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: హరీష్‌రావు

Ryathu bandhu amount Rs. 10000 in future
పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపు ఇచ్చారు. బుధవారం సిద్ధిపేటలో రూ.20 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభ్రమైన మాంసం, కూరగాయలు, పండ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం గొప్ప కాదని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  కొంచెం కష్టమైనా టిఫిన్ డబ్బా తెచ్చుకున్నవాళ్ళకే మాంసం అమ్మాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక  టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts