పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావు పిలుపు ఇచ్చారు. బుధవారం సిద్ధిపేటలో రూ.20 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభ్రమైన మాంసం, కూరగాయలు, పండ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం గొప్ప కాదని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొంచెం కష్టమైనా టిఫిన్ డబ్బా తెచ్చుకున్నవాళ్ళకే మాంసం అమ్మాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post
next post
రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్