telugu navyamedia
క్రైమ్ వార్తలు

మహబూబ్‌నగర్‌లో దారుణం-టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ర‌వి దారుణ‌హ‌త్య‌

*మ‌హ‌బూబాబాద్‌లో టీఆర్‌ఎస్‌ కౌన్సిల‌ర్ ర‌వి దారుణ‌హ‌త్య‌..
*ప‌త్తిపాక కాల‌నీలో బైక్ పై వెళుతుండ‌గా దారుణ హ‌త్య‌..
*తీవ్ర‌గాయాల‌తో చికిత్స పొందుతూ టీఆర్‌ఎస్‌ కౌన్సిల‌ర్ ర‌వి మృతి
*మాటువేసి ప‌బ్లిక్‌లో న‌రికి చంపిన దుండ‌గలు..

మహబూబ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు రవిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హ‌త్య చేశారు. ఆస్ప‌త్రి చికిత్స‌పొందుతూ మృతి చెందాడు.

పత్తిపాక కాలనీలో రవి బైక్‌పై వెళ్తుండగా మాటు వేసి ప‌బ్లిక్‌లో గొడ్డలితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతిచెందాడు.

బానోతు రవి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రవి.. అనంతరం టీఆర్ఎస్‌లో చేరాడు. 

ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ ఎంపీ కవితకు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు బానోతు రవి. అందుకే హత్య జరిగిన వెంటనే రవి కుటుంబాన్ని పరామర్శించారు కవిత. అక్కడ వారి ఘోష చూసి ఎంపి కవిత కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హత్యకు పాల్పడిన వారిని ఎవర్నీ వదిలి పెట్టేది లేదని చెప్పారామె. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. రవిని హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts