telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమైక్య రాష్ట్రంలో దేవాలయాలకు అన్యాయం: హరీష్‌ రావు

harish rao trs

సమైక్య రాష్ట్రంలో దేవాలయాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వనదుర్గా మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పనులను యుద్ధ ప్రాతిపదిక చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సీఎం అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఏడుపాయలకు వచ్చే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మెదక్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Related posts