తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా శాఖల సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు కరోనా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
కరోనా వైరస్ వల్ల కలిగే లక్షణాలు ఉండడంతో.. పరీక్ష చేయించుకున్నానని, ఆ పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు మంత్రి హరీశ్ తన ట్వీట్లో తెలిపారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు మంత్రి చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసినవారు కచ్చితంగా కరోనా పరీక్ష చేయించకోవాలని మంత్రి తన ట్వీట్లో కోరారు. తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఐసోలేట్ కావాలని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్