టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ ఎన్నికల్లో కూడా ప్రభంజనం సృష్టించింది. మెజార్టీ మండల పరిషత్లపై గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటి వరకు 436 మండల పరిషత్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 6 జిల్లాల్లో ఎంపీపీ పీఠాలు క్లీన్ స్వీప్ అయ్యాయి.
సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొమురంభీం, పెద్దపల్లి జిల్లాల్లో అన్ని ఎంపీపీలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ గల్లంతయింది. 12 జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతాయే తెరవలేదు. బీజేపీ కేవలం 8 ఎంపీపీలను మాత్రమే గెలుచుకున్నది.
కుంతియా అనే ఐరన్లెగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం: సర్వే