telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ కి షాక్… టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి విజయం

బీజేపీ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అధికార టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ ఇచ్చిన షాక్ కు సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది.  హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. నాలుగు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌ ఫలితం ఇప్పటికి వెలువడింది. తొలి ప్రాధాన్యత ఓటు ద్వారా విజేత తేలకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్‌ను చేపట్టిన అధికారులు వాణీదేవి విజయం సాధించినట్లు తేల్చారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు పై టీఆరెస్ అభ్యర్థి సురభి వాణి దేవి 11703 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు. టీఆరెఎస్ అభ్యర్థి వాణి దేవికి 1,49,269 రాగా బీజేపీ అభ్యర్థి కి 1, 37,566 ఓట్లు వచ్చాయి. అనూహ్యంగా సురభి వాణిదేవిని తెరపైకి తెచ్చిన టిఆర్ఎస్… ఈ గెలుపుతో మళ్ళీ ఊపులోకి వచ్చింది. 

Related posts