telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖ‌రారు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అభ్యర్థులను ఎంపిక చేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్లను ప్రకటించారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డి, సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావులను అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో తెరాస అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

ఎమ్మెల్సీ జాబితాలో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పదవి ఖాయమనుకుంటున్న తరుణంలోఅనూహ్యంగా ఎంపీ బండా ప్రకాశ్ పేరు చివరి నిమిషంలో వచ్చి చేరింది. ప్రస్తుతం బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన‌కు ఇంకా రెండున్నరేళ్ల పదవీకాలం ఉంది. అయినా ఆయన్ను ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ అధిష్టానం దింపుతోంది. ఈటల సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు మంత్రి పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది.

Related posts