హీరోయిన్ ఛార్మితో పెళ్లికి ఎప్పుడో ఓకే చెప్పేశానని అంటోంది సీనియర్ హీరోయిన్ త్రిష. హీరోయిన్లు ఛార్మి, త్రిష మంచి స్నేహితులనే విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ “పౌర్ణమి” సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది. శనివారం త్రిష 37వ జన్మదినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా త్రిషకు ఛార్మి ఘాటుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. “బేబీ నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రపోజల్కు అంగీకరించాల్సిందిగా మోకాళ్ల మీద నిల్చుని అడుగుతున్నా. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు అది చట్టవ్యతిరేకమేమీ కాదు” అని వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. దీనిపై స్పందించిన త్రిష.. “ధన్యవాదాలు.. మన పెళ్లికి నేనెప్పుడో ఓకే చెప్పాశా” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లకు నెటిజన్లు తమ స్టైల్లో కౌంటర్లు వేస్తున్నారు.
previous post