telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

Rail accident in Bihar 6 members Death

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున కస్బా పట్టణంలోని మొండోల్‌బాగ్ స్టేషన్‌లోఢాకా-బౌండ్ ఇంటర్‌సిటీ రైలు, చిట్టగాంగ్‌కు వెళ్తోన్న లోకోమోటివ్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 58 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండడంతో వారిలో చాలా మంది బోగీల్లోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు చెప్పారు.

Related posts