telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ట్రాక్‌పై ఫోన్ లో గేమ్.. రైలు ఢీకొని ఇద్దరి మృతి

Train accident 2 persons death

నేటి యువతకు సెల్ ఫోన్ ఓ వ్యసనంగా మారిపోయింది. సమయం సందర్భం లేకుండా ఇష్టాను సారంగా గేమ్స్ ఆడుతూ లోకాన్నే మరచిపోతున్నారు. ఇటీవల సెల్ ఫోన్ చూస్తూ ట్రాక్ దాటుతుందా హైదరాబాద్ లో ఓ నర్స్ మృతి చెందింది. తాజాగా రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ గేమ్ ఆడుతున్న ఇద్దరి యువకులు మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని హింగోళీలో చోటుచేసుకుంది. ఆటలో పడి లోకాన్ని మైమరచిపోయిన యువకులు రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేకపోయారు. దీంతో రైలు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

నగేశ్ గోరె (24), స్వప్నీల్ అన్నపూర్ణే (22) ఖట్కాలీ బైపాస్ వద్ద ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ ఆడుతుండగా హైదరాబాద్ నుంచి అజ్మేర్ వెళ్తున్న రైలు వారిని ఢీకొట్టింది. రైలు ఢీకొనడంతో వారు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts