జయాపజయాలకు అతీతంగా విక్రమ్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు విక్రమ్ కథానాయకుడిగా చీకటి రాజ్యం ఫేమ్ రాజేశ్ ఎం.సెల్వ తెరకెక్కించిన చిత్రం “కండరం కొండాన్”. ఈ చిత్రాన్ని తెలుగులో “మిస్టర్ కెకె”గా అనువదిస్తున్నారు. ఈ సినిమా జూలైలో సిని విడుదలవుతుంది. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్గా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా తమిళ ట్రైలర్ను కమల్ హాసన్ ట్వి్ట్టర్లో విడుదల చేయగా, తెలుగు ట్రైలర్ను అక్షర హాసన్ విడుదల చేశారు. అక్షరహాసన్, తన భర్తతో నివసిస్తుంటుంది. గర్భవతిగా ఉన్న ఆమెను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆమె భర్తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క విక్రమ్ అండర్ కవర్ ఆపరేషన్లో ఉండే కమెండో, డబుల్ ఏజెంట్గా మారిన వ్యక్తి అని తెలుస్తుంది. అతని పేరు కె.కె అని ట్రైలర్లో తెలియజేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
previous post
దీపికా స్టార్… అందుకే ఆమెకు జోడిగా నన్ను తీసుకోవడం లేదు : సల్మాన్ ఖాన్