ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్శర్మ హైకోర్టుకు ఆఫడవిట్ సమర్పించారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ఘాటుగా స్పందించారు. గాందీభవన్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ..సునీల్ శర్మ సమర్పించిన తప్పుడు ఆఫడవిట్ను సుమోటాగా స్వీకరించి న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎవరి ప్రోద్బలంతో నిరాధార అంశంపై హైకోర్టులో ఆఫడవిట్ వేశారని సునీల్శర్మను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రాజకీయ పార్టీలు కుట్ర చేసినట్లు ఆధారాలు ఉంటే అరెస్టు చేయాలని లేదంటే వెంటనే సునీల్శర్మను డిస్మిస్ చేయాలని ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.