telugu navyamedia
తెలంగాణ వార్తలు

అగ్నిపథ్ స్కీమ్ : పెద్దగా చదువుకోకపోవడం వల్లే తప్పుడు నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దగా చదువుకోకపోవడం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీపై విమర్శలు చేశారు.

ఆర్మీ ఎలా పని చేస్తుందో బీజేపీకి అర్థం కావడం లేదని అన్నారు. ఆయుధాలు వాడటం ఎలా అన్నది నాలుగేళ్లు నేర్పించి బయటకు పంపితే, తర్వాత వారు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు.

22 సంవత్సరాలకు ఆర్మీ నుంచి బయటకు వస్తే.. 70 ఏళ్లు వచ్చే వరకు అభ్యర్ధికి ఎలాంటి ఉద్యోగం లేకుండా గాలికి తిరగాల్సిన పరిస్ధితి వుంటుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్ధితుల్లో అసాంఘిక శక్తులతో చేతులు కలిపినా.. తీవ్రవాదం వైపు మళ్లినా , ఉద్యోగావశాలు లేక ప్రభుత్వంపై తిరగబడ్డా మొత్తం దేశ భద్రతకే ప్రమాదం వస్తుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ ఇలాంటి అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఇజ్రాయిల్ చిన్న దేశం, దానితో పోల్చడం కరెక్ట్ కాదని అన్నారు. అమెరికాలో ఆర్మీ నుంచి బయటకు రాగానే అవకాశాలు ఉన్నాయి. కానీ భారత్లో పరిస్థితి భిన్నమని అన్నారు. నిరుద్యోగ తీవ్రత ఎక్కువ వుందని, వెంటనే అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related posts