telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కుటుంబం మొత్తని కిడ్నప్ చేసిన దుండగులు…

తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తి తమను కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారంటూ చింతలపూడి పొలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇరువర్గాల నుంచి సమాచారం సేకరించారు పోలీసులు. వివరాలలోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన శివప్రసాద్ అతని భార్య షాజా, మూడేళ్ల కుమార్తెను హైదరాబాద్ కు చెందిన రాజేష్ అనే వ్యక్తి మరియు కొంతమంది వ్యక్తులు బుధవారం రాత్రి బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లుతున్నారు. ఈ క్రమంలో చింతలపూడి మండలం ఫాతిమపురం సమీపంలో శివప్రసాద్ బహిర్భూమికి వెళ్లాలని కారు ఆపి దిగాడు. శివప్రసాద్ తమను కిడ్నాప్ చేసి చంపాలని చూస్తున్నారంటూ మమ్మల్ని కాపాడండి అంటూ పరిగెడు తుండగా స్థానికులు చింతలపూడి పోలీసుస్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారుతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే వ్యక్తి కోటిన్నర వరకు తమకు నగదు ఇవ్వాలని వాటిని ఇవ్వకపోవడంతో శివప్రసాద్ ను అతని కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తున్నట్లు ఆ వ్యక్తులు తెలిపారు. ఈ విషయంపై గతంలో హైదరాబాద్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. బెయిల్ పై ఉన్న తమను బలవంతంగా హైదరాబాద్ తరలించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాదితుడు పేర్కోన్నారు. దీనిపై మరో వర్గం వారు మాట్లాడుతూ అతను హైదరాబాద్ లో ఉంటూ మలేషియా లో వస్త్ర వ్యాపారం చేస్తున్నారని చెప్పి నమ్మించగా తమ వద్ద నుంచి ఒక కోటి 86 లక్షల రూపాయల విలువైన వస్త్రాలను పంపించామని ఏడాది దాటినా ఆ నగదు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న చింతలపూడి పోలీసులు వారిని తాడేపల్లిగూడెం పోలీసు స్టేషన్ కు పంపించారు.

Related posts