సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకున్న బేగంబజార్ మార్కెట్ రేపటి నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ కిరాణా దుకాణాల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ది హైదరాబాద్ జనరల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు శ్రీరాం వ్యాస్లు వెల్లడించారు. సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి దుకాణాలు తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ నెల 6 నుంచి మార్కెట్లో ఉన్న అని దుకాణాలను తెరవ నున్నామని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తామని తెలిపారు. బేగంబజార్లో సుమారు 1,500 వరకు దుకాణాలు ఉండగా, కరోనా కట్టడిలో భాగంగా ఎనిమిది రోజుల పాటు స్వచ్ఛందంగా మూసి వేశారు. అయితే, సోమవారం నుంచి షాపులు తెరిచినా, కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తామని తెలిపారు.