telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహిళల దినోత్సవం : ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్‌ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రేపటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో మహిళా ఉద్యోగులకు ఈ శుభవార్త అందించింది. ఈ నెల 8న అంటే రేపు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు 2010, ఆగస్టు 4న జారీ చేసిన జీవో 433 ను అమలు చేయాలని సంబంధిత అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాని ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.

Related posts