telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు సీవీఎల్ నరసింహారావు…

హైదరాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సినీ నటుల మీడియా సమావేశాలు  హీట్ పెంచుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే పోసాని కృష్ణమురళి, డైరెక్టర్ శంకర్  ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈరోజు బీజేపీ కార్యాలయంలో సీవీఎల్ నరసింహారావు, కవిత,  వైభవ్, నటుడు రాజమౌళి, శ్రీ నాథ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీవీఎల్ నరసింగా రావు కీలక వ్యాఖ్యలు చేశారు.  శంకర్ మాటలు సినిమా స్క్రిప్ట్ కే పనిచేస్తాయని హిందువులకు అండగా ఉంటామన్నందుకు ఇంత రచ్చ చేస్తారా అని ప్రశ్నించారు. అరాచకాలు.. అల్లకల్లోలం చేస్తున్నారు అంటారా ? అని అయన ప్రశ్నించారు. హిందువులను చంపేస్తా… ఆవులను చంపేస్తా అంటే అప్పుడు మాట్లాడలనిపించలేదా ? అని ఆయన ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి ఆలయానికి ఎవరూ వెళ్ళొదనుకుంటున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. సినిమా అభివృద్ధికి ఫిలిం డెవలప్ మెంట్ అభివృద్ధి లేదని, ప్రభుత్వం తరఫున తెలంగాణ డైరెక్టర్ లకు ఎందుకు సాయం లేదు ? అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే మోఖిలాలో 50ఎకరాలు తీసుకోవడమేనా ? చిత్రపురిలో అర్హులకు ఎందుకు ఇల్లు ఇప్పించడం లేదు ? సినిమా వాళ్లు కాని వాళ్ళను ఎందుకు పంపించడం లేదు ? అని ప్రశ్నించారు.  సినీ అవార్డు లు ఇస్తున్నారా.. పక్క రాష్ట్రం వారు ఇస్తే పోయి తెచ్చుకుంటున్నారా అని ఆయన అన్నారు. సినిమా రంగంలో తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉన్నారా ? సినీరంగం అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలని ఆయన అన్నారు. అది లేకనే తెలంగాణ సినిమాను చంపేశారని ఆరోపించారు.

Related posts