telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నటుడు అశోక్ కుమార్ కు పితృవియోగం

Ahok-kumar

ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్‌ మాతృమూర్తి కె.వసుంధరాదేవి సోమవారం మృతి చెందారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో అశోక్ కుమార్‌ కుటుంబానికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేయగా, మరికొంతమంది ప్రముఖులు ఆయనని పరామర్శించారు. ఇక అశోక్ కుమార్ నిర్మాతగానే కాకుండా నటుడిగా ‘భారత్ బంధ్’ సినిమాతో తెరంగేట్రం చేసాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఓవర్ నైట్ నటుడిగా పాపులర్ అయ్యాడు. ఈయన నిర్మాతగా ‘రక్త తిలకం’, ‘ధృవ నక్షత్రం’, ‘చెవిలో పువ్వు’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ఈశ్వర్’ ‘జయదేవ్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.

Related posts