telugu navyamedia
సినిమా వార్తలు

మ‌హేష్‌బాబుకు క‌రోనా పాజిటివ్‌..

క‌రోనా థ‌ర్డ్ వేవ్ మొద‌లైంది. దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ తార‌లు వైరస్ బారిన ప‌డి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Mahesh Babu is off to Spain for Sarkaru Vaari Paata shoot. See pic, video  from airport - Movies News

ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తనకు కరోనా సోకిందంటూ పోస్ట్ పెట్టారు. నా అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఇసో లేషన్ లో ఉన్నానని పేర్కొన్నారు మహేష్. అలాగే గత కొద్దీ రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని కోరారు మహేష్.

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే తిరిగి షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు మహేష్ బాబు. ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. అది కరోనా తీవ్రత నుంచి హాస్పిటల్ వరకు వెళ్లకుండా కొద్దిగా అయినా తప్పిస్తుంది. దయచేసి అందరు కరోనా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి.. మళ్లీ తిరిగి రావడానికి వేచి ఉండలేను” అంటూ ట్వీట్ చేశారు.

Shocking! Tollywood superstar actor affected by COVID-19 - Tamil News -  IndiaGlitz.com

దీంతో మహేష్‌కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం మ‌హేష్‌బాబు పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘సర్కారు వారి పాట’సినిమా లో చేస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Breaking News: Mahesh Babu Tests Positive For Covid-19

Related posts