టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. తాజాగా అక్కినేని హీరో సుశాంత్ ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. నటుడు అక్కినేని నాగచైతన్య విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ని స్వీకరించిన హీరో సుశాంత్.. ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తనని కూడా భాగస్వామ్యం చేసినందుకు గాను నాగచైతన్యకి కృతజ్ఞతలు తెలిపారు..ఇక ఎంపీ సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఇంతటి వినూత్నమైన కార్యక్రమం రూపొందించడం చాలా గొప్పదని, గర్వించదగ్గ విషయమని అన్నారు.
previous post