telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు వైఎస్ఆర్‌ పింఛను కానుక పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్‌ పింఛను కానుక పంపిణీ కార్యక్రమాన్ని నేడు చేపట్టనుంది. ఆమేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, ఒంటరి మహిళలు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్స్‌కు రూ.2 వేలు పింఛనును రూ.2,250, వికలాంగులకు రూ.3 వేలు, డయాలసిస్‌ రోగులకు రూ.3,500 నుంచి రూ.10 వేలకు పెంచిన ఫించన్లు ఆయా పంపిణీ కేంద్రాల్లో అందించనుంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కమిషనర్‌ రమణారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని పింఛను పుస్తకాల స్థానంలో వైసీపీ ప్రభుత్వం ముద్రించిన కొత్తపుస్తకాలు ఆయా పింఛను కేంద్రాల్లో సిబ్బంది అందజేస్తారన్నారు.

Related posts