విజయనగరం పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించినందున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న సిరిమానోత్సవం, సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం, భక్తుల కోసం 50 వేలు చొప్పున లడ్డూలు, పులిహోరా ప్యాకెట్లు సిద్ధం.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు, భక్తుల సౌకర్యార్థం నగరంలోని 20 ప్రాంతాల్లో చలివేంద్రాలు.
పారిశుద్ధ్య పనుల కోసం అదనంగా 300 మంది కార్మికులు నియామకం – సిరిమానోత్సవ పర్యవేక్షణకు 2 వేలమంది పోలీసులతో బందోబస్తు.
సిరిమాను ఊరేగింపు జరిగే ప్రాంతంలో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు, అమ్మవారి ఆలయం ఎదురుగా కమాండ్ కంట్రోల్ రూమ్, ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిషేధం.