తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటన ముగించుకొని నేడు హైదరాబాద్కు రానున్నారు. ఇప్పటికే కేరళ పర్యటన ముగించుకున్న కేసీఆర్.ఈ రోజుతో తమిళనాడు పర్యటన కూడా ముగియనుంది. ఇవాళ రాత్రి హైదరాబాద్కు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తిరుగు పయనం పయనమవుతారు. రెండ్రోజులుగా కేసీఆర్ తమిళనాడు పర్యటనలో ఉన్నారు.
గురువారం తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి కలాం సమాధికి కేసీఆర్ నివాళులు అర్పించారు. శుక్రవారం రామేశ్వరంలో రామలింగేశ్వరస్వామి ఆలయంలో రామలింగేశ్వరుడిని కేసీఆర్, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో పాటు కుటుంబసభ్యులు ఉన్నారు.
పవన్ కల్యాణ్ లాంగ్మార్చ్ అట్టర్ఫ్లాఫ్: విజయ సాయిరెడ్డి