ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56, 463 శాంపిల్స్ పరీక్షించగా.. 809 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 1,160 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,83,50, 167 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,51, 133 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 20,25,805 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,186 కు చేరిందని.. ప్రస్తుతం 11, 142 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.