లండన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ప్రముఖ సినీనటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి కరోనా భయంతో 14 రోజులపాటు హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ప్రముఖ సినీనటి కూడా అయిన మిమీ చక్రవర్తి ఓ సినిమా చిత్రీకరణ కోసం సినీ నిర్మాణ సంస్థ సిబ్బందితో కలిసి లండన్ వెళ్లారు. సినిమా షూటింగ్ అనంతరం మిమీ చక్రవర్తి బుధవారం తిరిగి లండన్ నుంచి కోల్కతాకు వచ్చారు. మిమీ చక్రవర్తికి కొవిడ్-19 సోకకపోయినా, ముందు జాగ్రత్తచర్యగా ఆమె 14 రోజులపాటు హోం క్వారంటైన్లోకి వెళ్లారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ సెక్రటరీ అనీర్బన్ భట్టాచార్య చెప్పారు. కరోనా వైరస్ ప్రబలిన దేశాల నుంచి స్వదేశానికి వస్తున్న వారంతా 14రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సినీనటి అయిన ఎంపీ మిమీ చక్రవర్తి హోంక్వారంటైన్లోకి వెళ్లారు.యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించి వచ్చిన 18 ఏళ్ల యువకుడికి కొవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.
previous post
అక్కా అక్కా అంటూనే తొక్కేసారు… బిగ్ బాస్ పై హేమ వ్యాఖ్యలు