ఎన్నికల ఫలితాల గడువు దగ్గరపడేకొద్దీ తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 39 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 18 గంటల సమయం, నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
శ్రీవారిని నిన్న 79,251 మంది భక్తుల దర్శించుకున్నారు. 38,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం నిన్న రూ. 4.10 కోట్లుగా ఉంది.