*తిరుమాడవీధుల్లో నయనతార విఘ్నేష్ దంపతలు అపచారం
*వివాహ అనంతరం శ్రీవారి దర్శనం తిరుమల వచ్చిన నయనతార విఘ్నేష్ దంపతలు
*ఆలయం ముందు చెప్పులు వేసుకొని తిరిగిన నయనతార
*స్వామివారి ఆలయం ముందు ప్రత్యేకంగా ఫోటో షూట్..
*ఒకరినొకరి పట్టుకుని స్వామి ఆలయం ముందు ఫోటోకు ఫోజులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది. వివాహ అనంతరం నయనతార విఘ్నేష్ దంపతలు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు.
తిరుమాడవీధుల్లో చెప్పు లు ధరించకూడదని నిబంధనలు ఉన్నాయి. .కానీ అదేమీ పట్టనట్లు శ్రీవారి ఆలయం వద్ద కాళ్లకు చెప్పులు ధరించి నయనతార, ఆమె భర్త సంచరించారు.
అంతేకాకుండా స్వామివారి ఆలయం ముందు నయనతార దంపతులు ప్రత్యేకంగా ఫోటో షూట్ చేశారు.. ఒకరినొకరి పట్టుకుని స్వామి ఆలయం ముందు ఫోటోకు ఫోజులు ఇచ్చారు.
ఇది అంతా ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయం ముందుగా నిర్వహించడంపై పలువురు భక్తులు మండిపడుతున్నారు.
తిరుమలలో విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫొటో షూట్ పేరిట ఆలయం ముందు అంత తతంగం జరుగుతున్నా విజిలెన్స్ పట్టించుకోకపోవడం వివాదస్పదంగా మారింది.
తిరుమల పవిత్రత దెబ్బ తీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠినంగా వ్యవహరించే టీటీడీ నయనతార ఫొటో షూట్ వ్యవహారంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
సిగ్గు లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు ఛీఛీ… : శ్రీరెడ్డి