telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

తప్పు ఒప్పుకున్న పైన్…

క్రికెట్ ను జెంటిల్ మెన్ గేమ్ అని పిలుస్తారు. అయితే ఈ ఆటలో స్లెడ్జింగ్‌, చిట్టింగ్ కు పెట్టింది పేరు ఆసీస్ ఆటగాళ్లు. అయితే ప్రస్తుతం అన్ని జట్ల పై తమ మాటల ఆయుధాన్ని ఉపయోగించే ఆసీస్ భారత జట్టు పై చాలా కాలంగా ఉపయోగించడం లేదు. అయితే తాజాగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ తన నోటికి పని చెప్పాడు. భారత జట్టు 5 వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అశ్విన్, విహారి మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను డ్రా గా ముగించారు. అయితే అశ్విన్ బ్యాటిగ్ చేస్తున్న సమయంలో కీపర్ పైన్ ”నాలుగో టెస్ట్ వేదికకు మిమల్ని తీసుకెళ్లడానికి చాలా ఆతృతగా ఉన్న యాష్(అశ్విన్)… నేను చెప్పింది అర్థమైందా” అని అన్నాడు. దానికి ”మేము కూడా మిమల్ని భారత్ కు తీసుకురావడానికి చూస్తున్నాం… నీకు అదే చివరి సిరీస్ అవుతుంది” అని సమాధానం ఇచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం పైన్ మాట్లాడుతూ తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. అలాగే మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకుంటా అని పేర్కొన్నాడు. ఇక ఈ నెల 15 న జరగనున్న నాలుగో టెస్ట్ లో విజయం ఎవరు సాధిస్తే సిరీస్ వారిదే అవుతుంది.

Related posts