telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

బీహార్ లో గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు 36 మంది మృతి

Thunderbolts strikes

బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు పిడుగులు పడడంతో 36 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల వ్యవధిలో బీహార్ లోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పిడుగులు పడ్డాయి. అసమ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది.

బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు భారీవర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో వరద భయంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తప్పనిసరి అయితే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

Related posts