ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో చోరీలకు పాల్పడుతున్న వినోద్కుమార్ అనే ఘరానా దొంగను ఈస్ట్జోన్ టాస్క్పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 22 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాలాజీనగర్కు చెందిన వినోద్.. కారు డ్రైవర్గా పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. మూడు కమీషనరేట్ల పరిధిలో 14 దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. రెండు సార్లు అతనిపై పీడీ యాక్ట్ ఉందని, మరోసారి పీడీయాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు.