telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

షాద్‌నగర్ మార్కెట్ యార్డులో దొంగతనాలు

జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట వద్ద గల ప్రభుత్వ మార్కెట్ యార్డులో దొంగలు హల్ చల్ చేశారు. దాదాపు ఎనిమిది ట్రేడర్స్ షాపులకు సంబంధించిన షేటర్లను ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. సుమారు మూడు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్టు బాధిత ట్రేడర్స్ వర్గాలు తెలిపాయి. ట్రేడర్స్ షాప్ నెంబర్స్ 2,4,5,6,16, 17, 21 తదితర షాపుల్లో దొంగతనాలు జరిగినట్లు బాధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడర్స్ బాధితులు హలో షాద్‌నగర్ దృష్టికి తీసుకు వచ్చాయి. శివ శంకర్ ట్రేడింగ్ కంపెనీలో ఒక లక్షా 70 వేల రూపాయలను, రమణ షాపులో 2000, మల్లప్ప షాపులో 3000, ఓం సాయి ట్రేడర్స్ లో 50000, వెంకటేశ్వర ట్రేడర్స్ లో 3000, అమరవది కృష్ణయ్య షాపులో 3000 మల్లేశ్వరస్వామి షాపులో నగదును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. దాదాపు మూడు లక్షల రూపాయల వరకు నగదు చోరీకి గురైందని బాధితులు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఈ దొంగతనాలు జరిగినట్లుగా ట్రేడర్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బీహార్ కు చెందిన హమాలీలు పక్కన షెటర్లో పడుకొని ఉన్నారు. అయితే వారు తెల్లవారుజామున 4 గంటలకు లేచి చూడగా షేటర్లు పెకలించి ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా యజమానులకు ఫోన్లు చేయగా వారు హుటాహుటిన మార్కెట్టు వద్దకు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts