జమ్మూకాశ్మీర్ లోని త్రాల్ జిల్లాలో ఓ సీఆర్పీఎఫ్ క్యాంప్పై ఉగ్రదాడి జరిగింది. సీఆర్పీఎఫ్ 180 బెటాలియన్ బలగాలను లక్ష్యంగా చేసుకొని శుక్రవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదులు కూడా కాల్పులు జరుపుతుండటంతో ప్రస్తుతం అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
అంతకుముందు షోపియాన్ జిల్లా జైనాపొర ప్రాంతంలోని ద్రగడ్ సమీపంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. తారసపడిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. భద్రతా బలగాలు దీటుగా స్పందించి ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టాయి.