ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతతో వేలాది మంది భావన కార్మికులు పని లేక ఉపాధి కోల్పోయారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక కొరతపై టీడీపీ తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు సిద్దమైంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇసుక కొరత, తదనంతర పరిణామాలపై నిరసనగా రేపు గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించనున్నారు. ఈ నిరసన ప్రదర్శనకు భారీగా టీడీపీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉంది.
వారి త్యాగాల ఫలితమే బీజేపీ : బండి