telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు: నక్కా ఆనందబాబు

nakka anand on tdp party with nri's

ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలో దళితుల ఆత్మగౌరవ యాత్ర ఈరోజు నిర్వహించారు. ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

తప్పులను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, మీడియాను అణగదొక్కలని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వర్ల రామయ్యపై రాజకీయ నేతల తరహాలో వ్యాఖ్యలు గుప్పించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts