*ఈటెలను కలిసిన సినీ నటి దివ్యవాణి
*బీజేపీలో చేరతానని ఈటలను కోరిన దివ్యవాణి
*అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని ఈటల
మాజీ టీడీపీ నేత , సినీ నటి దివ్యవాణి బీజేపీలో చేనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సినీనటి తెలంగాణ రాజకీయాలవైపు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఆమె హైదరాబాద్ షామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లి కలిసారు. బీజేపీలో చేరతానని ఆమె ఈటలను కోరినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని ఈటల చెప్పినట్లుగా సమాచారం.
భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన దివ్యవాణి.. . తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకుంటోందని అభిప్రాయపడ్డారు. తనకు ఏపీ, తెలంగాణలో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ అనుబంధం ఉందన్న దివ్యవాణి.. బీజేపీలో చేరి ఆ పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరికపై త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు.