తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రాగా, త్వరలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ను వెల్లడించే అవకాశం ఉంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎస్సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది.
మే 9-12 తేదీల మధ్య పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక టెన్త్ పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11,12 తేదీల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
నిజానికి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్లోనే జరగాల్సి ఉంది. ఇందు కోసం నవంబర్ నెల నుంచే అధికారులు కసరత్తు ప్రారంభిస్తారు. కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే గత సంవత్సరం విద్యార్థులను పాస్ చేశారు. ఈ ఏడాది కూడా కోవిడ్ థర్డ్వేవ్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఉంటాయా..? లేదా అనే ఆలోచనలో పడిపోయింది విద్యాశాఖ.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు తరువాత పరీక్ష షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.