telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడే తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుద‌ల ..చెక్ చేసుకోండి ఇలా

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మ‌రికాసేప‌ట్లో విడుదల కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో… విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుద‌ల చేస్తారు. పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు.

టెన్త్ పరీక్షలను ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా  5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎస్​ఎస్సీ బోర్డు డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. విద్యా‌ర్థులు తమ ఫలి‌తా‌లను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.inలో చూసుకోవచ్చు.

Related posts