telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు.. 

Road accident 8 dead and 30 injured
ఇటీవల ఆర్టీసీ లో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది సంస్థ నిర్లక్ష్యమా.. లేక డ్రైవర్ లదా అనేది పక్కనపెడితే, మొత్తానికి ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇన్సూరెన్సు ఉంది కదా అని ఇష్టానుసారంగా బస్సులు నడిపిస్తారా..! తాజాగా, తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న ట్యాంకర్ ను ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇధ్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 15 మందికి గాయాలు అయ్యాయి.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డవారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్‌కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. లారీ ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Related posts