చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా కొప్పుల ఈశ్వర్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని.. నియమ నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్భందంలోకి వెళ్ళానని పేర్కొన్నారు కొప్పుల. అలాగే ఈ మధ్య కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే సిఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.
previous post
తాను ఏ విచారణకైనా సిద్ధం: చింతమనేని