రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈరోజు కోర్టులో కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్ టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రభుత్వం పూర్తిగా రాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీ పీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన ఏజీ… కరోనా పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని తెలిపారు. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు సీరియస్ అయింది. ఆర్ టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసిన హైకోర్టు… వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించాలని… బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాల పై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. అనాధ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని..కరోనా నిబంధనలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఆదేశించింది.
previous post
next post
ఆ వ్యాఖ్యల పై సాధ్వి క్షమాపణలు చెప్పాలి: జీవీఎల్