telugu navyamedia
తెలంగాణ వార్తలు

తీన్మార్‌ మల్లన్న పిటిషన్‌పై హైకోర్టు ఆదేశం

తనపై పోలీసులు పలు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ పై వెంటనే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇవాళ మల్లన్న వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల తీన్మార్ మల్లన్న ఆఫీసులపై పోలీసులు దాడులు చేసి, పలు హార్డ్ డిస్క్ లను పట్టుకెళ్లారు. మర్నాడు సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే తనను పోలీసులు వేధిస్తున్నారని, కారణాల్లేకుండా పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో మల్లన్న పిటిషన్ వేశారు. సీసీఎస్, చిలకలగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. స్టేషన్‌కు పిలవకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆన్‌లైన్‌లో విచారణ జరిపేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Related posts