తెలంగాణలో వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించాడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షలను జూన్ 8 తర్వాత నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని సూచించింది. భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది.
జూన్ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కారుని హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలోనూ కేసుల తీవ్రత పెరుగుతున్నట్లయితే, అప్పటి పరిస్థితులను బట్టి మరో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. రాష్ట్రంలో లాక్డౌన్ కి ముందు పదో తరగతి పరీక్షలు మూడు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్తోమరో ఎనిమిది వాయిదా పడ్డాయి. మిగిలి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్షల కేంద్రాల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారు: శ్రీకాంత్ రెడ్డి