వినాయక నిమజ్జనంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలి అని తెలిపింది.
హైకోర్టు కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి సూచింది. ప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్తితులు కూడా చూడాలి అని హైకోర్డు సూచించింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయం వెల్లడించింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలి అంది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తాం అని హైకోర్టు వెల్లడించింది.