తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు కృష్ణ కుమారి కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లుగా చెబుతున్నారు.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
.కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్భవన్లో ఉంచనున్నారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని చెన్నైకి తరలించనున్నారు.
కాగా.. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య.. ఆ దంపతుల పెద్ద కుమార్తె గవర్నర్ తమిళిసై. కృష్ణకుమారి అంత్యక్రియలను ఇవాళ చెన్నైలో నిర్వహించే అవకాశం ఉంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మరణం పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు