నేటి నుంచి టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్
మూడు రోజులు పాటు జరగనున్న ఎంసెట్
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జులై 18,19,20 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించనున్నారు. రోజూ రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తుండగా… ఒక్కో సెషన్కు సుమారు 29 వేల మంది హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు… రెండోపూట పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇంజినీరింగ్కు లక్షా 72 వేల 241 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 89, ఏపీలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.ఒక్క నిమిషం నిబంధన అమలు కానుంది. అంటే.. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్ధులను గంట ముందు నుండే పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు.
వాయిదాపడిన అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి త్వరలో ఖరారు చేయనుంది.. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 79 వేల 365 దరఖాస్తులు వచ్చాయి.
ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెట్ వర్క్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంసెట్ నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేశారు. నిమిషం రూల్ అమలు చేస్తున్నారు, సమయానికి నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోనికి పంపిస్తారు. మొబైల్స్ , వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ జాగ్రత్తలు అభ్యర్థులంతా ఖచ్చితంగా పాటించాలని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు.
అలాగే వర్షాలు పడి రోడ్లు దెబ్బతిని, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. అందుకు సరైన కారణం చూపిస్తే మాత్రం పరీక్షలకు అనుమతించాలని భావిస్తున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల అధికారులు కన్వీనర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారుల అనుమతి తీసుకొని కొద్దిగా ఆలస్యం వచ్చిన వారిని అనుమతించనున్నట్లు సమాచారం. ఒకవేళ బాగా ఆలస్యంగా వస్తే… తర్వాత రెండు రోజుల్లో ఏదో ఒక విడతలోనూ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని యోచిస్తున్నారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి: బండారు దత్తాత్రేయ