తెలంగాణ ఎంసెట్ ఆన్లైన్ పరీక్ష బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. 9,10,11,14 తేదీల్లో రెండు విభాగాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం హాల్టికెట్తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్ను కూడా నిర్వాహకులు ఇచ్చారు.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్ చెక్ చేసి, చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపించారు. ఉదయం 9:00 ల నుంచి 12:00 వరకు మొదటి విభాగం..మధ్యాహ్నం 3:00ల నుంచి 6:00ల వరకు రెండవ విభాగంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు రోజుల్లో 800 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మాస్క్ లేనిదే కళాశాల స్టాఫ్ వెలుపలికి రానివ్వడం లేదు.