ఏపీ సేవా మిత్ర యాప్ లో తెలంగాణ డేటా ఉందని సిట్ అధికారి ఐపీ స్టీఫెన్ రవీంద్ తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వివరాలతో ఏం చేస్తారన్న విషయం తమ దర్యాప్తులో తేలుతుందని ఆయన పేర్కొన్నారు.
ఐటీ గ్రిడ్స్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించామని వివరించారు కేసు విచారణ నిస్పక్షపాతంగా జరుగుతుంది. దర్యాప్తులో పురోగతి మేరకు వివరాలు వెల్లడిస్తాం’ అని రవీంద్ర అన్నారు.
గత వారంగా ఐటీ గ్రిడ్ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిట్ విచారణ జరుగుతుంది. అసలు ఎవరు డేటా, ఎవరు చోరీ చేసింది తెలియక ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డేటా వార్ జరుగుతున్న నేపథ్యంలో, ఏపీ సైట్ లో తెలంగాణ డేటా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది.