తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో ఒక్కరు కరోనాతో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,631 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,95,059 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1,633 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 97.1 శాతంగా ఉంటే.. స్టేట్లో 98.80 శాతానికి పెరిగిందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 1,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. జీహెచ్ఎంసీ పరిధిలో తాజా కేసులు 30 కేసులు నమోదు అయ్యాయి.
previous post